in

Bellamkonda Sreenivas to star in the Telugu remake of ‘Karnan’!

టీవల వచ్చిన ‘అల్లుడు అదుర్స్’ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీలో ‘ఛత్రపతి’ సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం ప్రస్తుతం హీరోయిన్లను వెతుకుతున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా  దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ను సంప్రదించారని గుసగుసలు వినిపించాయి.

దాని పైన ఇంతవరకు క్లారిటీ రాలేదు. కాగా ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సింది. కానీ కరోనా కారణంగా ఆగిపోయింది. అయితే తాజాగా తెలుగులో ఆయన చేయనున్న నెక్స్ట్ మూవీ ‘కర్ణన్’ రీమేక్ అని తెలుస్తోంది. ధనుశ్ హీరోగా ఇటీవల థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, కోలీవుడ్లో వసూళ్ల వర్షాన్ని కురిపించింది. దాంతో బెల్లంకొండ శ్రీనివాస్ ఆ సినిమా రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నాడట. ‘ఛత్రపతి’ రీమేక్ షూటింగు పూర్తయిన తరువాత ‘కర్ణన్’ రీమేక్ షూటింగ్ మొదలవుతుందట. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారో చూడాలి..

payal rajput turns villain for ‘3 roses’!

Megastar Chiranjeevi’s daughter Sushmita turns producer!