in

‘ARAVINDHA SAMETHA’ WILL ALWAYS BE SPECIAL FOR ME!

తారక్‌తో కలిసి స్ర్కీన్‌ పంచుకోవడం అద్భుతంగా అనిపించిందని బుట్టబొమ్మ పూజాహెగ్డే అన్నారు. ఈ ఏడాది ఆరంభంలో ‘అల.. వైకుంఠపురం’ చిత్రంతో మాంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆమె ప్రస్తుతం దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లో సైతం వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘అరవింద సమేత’ సినిమా గురించి స్పందించారు. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌-పూజాహెగ్డే మొదటిసారి స్ర్కీన్‌ పంచుకున్నారు.

2018లో విడుదలైన ఈ చిత్రం గురించి పూజా మాట్లాడుతూ.. ‘‘అరవింద సమేత’.. ఎప్పటికీ నాకు ఓ ప్రత్యేకమైన చిత్రం. ఎన్టీఆర్‌తో కలిసి నటించే అవకాశం ఈ సినిమాతో నాకు లభించింది. ఆయనతో కలిసి పనిచేయడం అద్భుతంగా అనిపించింది. మా ఇద్దరికీ ఎనర్జీ లెవల్స్‌ కొంచెం ఎక్కువగా ఉంటాయి. దానివల్లే ఆన్‌స్ర్కీన్‌లో మా జోడీ ప్రేక్షకులను అన్నివిధాలుగా అలరించింది. ఆన్‌స్ర్కీనే కాకుండా ఆఫ్‌స్ర్కీన్‌లో సైతం ఈ చిత్రం నాకెన్నో అనుభవాలను అందించింది. దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ వల్ల ఈ సినిమాలోని అరవింద పాత్రకు నేను డబ్బింగ్‌ చెప్పుకున్నాను.’ అని పూజాహెగ్డే ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు..

OKKA RAGHAVENDRA RAO GAaRE SADINCHINA ARUDHAINA GANATHA!

RUMORS cleared ABOUT ANUSHKA IN MAHESH BABU MOVIE!