in

Adipurush Dialogues To Be Changed, Writer Manoj confirms!

దిపురుష్ డైలాగ్స్‌పై వివాదం పెరుగుతుండటంతో చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో వచ్చే వారం నుంచి కొత్త డైలాగ్స్‌తో సినిమా ఉంటుందని వెల్లడైంది. ఈ విషయాన్ని స్వయంగా సినిమాకు డైలాగ్స్ రాసిన రచయిత మనోజ్ ముంతషిర్ శుక్లా తెలిపారు. తాను రాసిన డైలాగ్స్‌కు అనుకూలంగా లెక్కలేనన్ని వాదనలు ఇవ్వగలిగినా మీ బాధను తగ్గించలేనని మనోజ్ వివరించారు. అందుకే కొన్ని డైలాగ్స్‌ని రివైజ్ చేసి కొత్తవి చేరుస్తామని వచ్చే వారం కొత్త డైలాగ్స్‌తో ఆదిపురుష్ మీ ముందుంటుందని ఆయన తెలిపారు.

అయితే  డైలాగ్స్ నచ్చని కొంతమంది చేసిన ట్రోలింగ్‌పై రచయిత మనోజ్ శుక్లా నొచ్చుకున్నారు. ఈ సినిమాలో తాను 4000 లైన్లతో శ్రీరాముడిని, సీతను కీర్తించిన విషయాన్ని పక్కనబెట్టి కేవలం 5 లైన్లు మనోభావాలు దెబ్బతీశాయని విమర్శించడంపై ఆయన ఆవేదన చెందారు. ఈ 5 లైన్లను ఆధారం చేసుకుని సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన మాటలు రాశారని, ఏకంగా సనాతన్ ద్రోహిగా మార్చేశారన్నారు. సినిమాలో తన కలం నుంచి వచ్చిన జై శ్రీరామ్, శివోహం, రామ్ సియారామ్ పాటలు కన్పించలేదా అని ప్రశ్నించారు..!!

JD Chakravarthy Denies Dating anchor Vishnu Priya!

POTTI PRASAD KNOWN FOR HIS TIMING!