in

actress tabu gives a warning to bollywood hero Karthik Aryan!

కప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది టబు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించింది. ఆ తరువాత బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. ఆమె నటించిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ తన సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పెను సినిమాల్లో నటిస్తోంది. ఆమె చివరిగా తెలుగులో అల్లు అర్జున్ నటించిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలో కీలకపాత్రలో నటించింది.

ఈ సినిమాలో ఆమె సీరియస్ లుక్ తో కనిపిస్తుంటుంది. ఇక ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. బనీన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. దీంతో ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ లో యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. అయితే షూటింగ్ లొకేషన్ లో దర్శకుడు రోహిత్ ధావన్ తో తీసుకున్న సెల్ఫీను కార్తిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ ఫోటోపై టబు స్పందించింది. ”అది నా సినిమా.. జాగ్రత్తగా రీమేక్ చేయండి” అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఇది చూసిన కార్తిక్ ఆర్యన్ ”మీ సినిమా కాబట్టే ఇంకా ఎక్కువ ప్రేమతో చేస్తున్నాం మేడమ్” అంటూ రిప్లై ఇచ్చాడు. ఈ సినిమాకి ‘షెహ్ జాదా’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో కార్తిక్ ఆర్యన్ కు జోడీగా కృతిసనన్ నటిస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘rrr’ lo alia bhatt yela vacchi cherindhi!

Here’s Why Sai Pallavi Got Emotional At ‘SSR’s Pre-Release Event!