
తమిళ స్టార్ హీరో, దర్శకుడు ధనుష్ దర్శకత్వంలో బాలీవుడ్.. సౌత్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో ఒక ప్రత్యేకమైన సినిమా రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ధనుష్ ఇప్పటికే నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా తన ప్రతిభను చూపించారు. ఆయన తీసిన సినిమాలు కథా పరంగా ప్రత్యేకతను చూపించాయి. అందుకే ఆయన దర్శకత్వంలో మరో కొత్త ప్రాజెక్ట్ అంటే ప్రేక్షకుల్లో సహజంగానే ఆసక్తి పెరుగుతోంది. ఈసారి ఆయన ఒక పీరియాడిక్ కథను ఎంచుకున్నట్లు సమాచారం. ఈ సినిమా 1960 నుంచి 1970 మధ్య కాలంలో జరిగే కథగా ఉండబోతోందని చెబుతున్నారు.
