in

Meenakshi Choudhary Set for Bollywood Debut with top star!

మీనాక్షి చౌదరి ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యింది. ‘ఖిలాడి’, ‘హిట్ 2’, ‘లక్కీ భాస్కర్’ వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, అక్షయ్ కుమార్ సరసన ‘భాగమ్ భాగ్ 2’ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికయ్యింది. రాజ్ శాండిల్య దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా, గతంలో వచ్చిన సూపర్ హిట్ కామెడీ మూవీకి సీక్వెల్‌గా ఉండబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో మీనాక్షితో పాటు విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ మరియు ఆయేషా ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు..

ఒరిజినల్ మూవీ తరహాలోనే పక్కా కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం మీనాక్షి కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. 2021లో తెలుగు తెరకు పరిచయమైన ఆమె, అతి తక్కువ కాలంలోనే హిందీలో భారీ అవకాశం దక్కించుకోవడం విశేషం. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి నుండి ప్రారంభం కానుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, సినిమాను 2026 చివరి నాటికి థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో సక్సెస్ అందుకున్న మీనాక్షి, అక్షయ్ కుమార్‌తో కలిసి బాలీవుడ్ ప్రేక్షకులను ఎలా అలరిస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..!!

Aishwarya Rajesh and Vikranth join hands for Under 18!