
సినీ నటి వాహిని కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న ఆమె..తన స్వస్థలం విజయనగరంలో నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సినీ నటి కరాటే కల్యాణి వెల్లడించారు. వాహిని మృతి పట్ల సహ నటీనటులు, సినీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 48 ఏళ్ల వాహిని విజయనగరంలో జన్మించారు. తెలుగుతో పాటు పలు తమిళ చిత్రాల్లో కూడా ఆమె నటించారు. సహాయ నటిగా మంచి గుర్తింపు పొందారు. సినిమాలతో పాటు బుల్లితెరపై ఆమె సందడి చేశారు. అనేక ప్రేక్షకాదరణ పొందిన సీరియల్స్ లో ఆమె నటించారు. సీరియల్స్ లో ఎంతో క్రేజ్ తెచ్చుకున్నారు..!!

