in

Rakul Preet Singh on Social Media Trolls!

సెలెబ్రెటీల వ్యక్తిగత జీవితాలపై దుష్ప్రచారం చేయడం, వారిని వ్యక్తిగతంగా బాధపెట్టడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. వారికి ఇంతకంటే వేరే పనేమీ లేకుండా పోయింది. మన దేశంలో పనికిమాలిన వాళ్ళు ఎక్కువయ్యారు’ అంటూ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది రకుల్ కు మద్దతుగా కామెంట్లు పెడుతుండగా మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు..

కాగా, టాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన రకుల్ ప్రీత్ సింగ్ వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది. ఇటీవల రకుల్ నటించిన ‘మేరే హస్సెండ్ కి బివి’ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా రకుల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటోంది. తనను ట్రోల్ చేస్తున్న వారికి కౌంటర్లు ఇస్తూ బిజీబిజీగా గడుపుతోంది..!!

mollywood star Tovino Thomas joins NTR-Prashanth’s dragon!

Anasuya Talks About Blocking 30 Lakh Followers!