in

Samantha Says No to ‘Ye Maaya Chesave’ Promotions!

నాగచైతన్య సమంత నటించిన రొమాంటిక్ డ్రామా ‘ఏ మాయ చేసావె’  సుమారు 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపైకి రానుంది. ఈ చిత్రం జూలై 18 న రీ రిలీజ్‌ కాబోతుండటంతో అభిమానుల్లో ఎంతో ఉత్సాహం నెలకొంది. అయితే రీ రిలీజ్‌ సందర్భంగా సమంత, చైతన్య కలిసి ప్రమోషన్లలో పాల్గొంటారన్న ప్రచారం సోషల్ మీడియా వేదికగా జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సమంత స్పందిస్తూ, తాను ఎలాంటి ప్రమోషన్లలోనూ పాల్గొనడం లేదని స్పష్టం చేశారు..

ఈ ప్రచారాలు నిరాధారమని ఆమె ఒక ప్రముఖ ఆంగ్ల వెబ్‌సైట్‌కి తెలిపారు. ‘‘చిత్రబృందం తరఫున ప్రమోషన్లలో నేను పాల్గొనట్లేదు. వాస్తవానికి ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలకు నేను దూరంగా ఉన్నా. ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియడం లేదు. ప్రేక్షకులు మనసులో కలిగించుకున్న ఊహలు ఇలా పుకార్లుగా మారుతున్నాయి. ఎవరి జీవితం కూడా ప్రజాదృష్టికోణంపై ఆధారపడి ఉండదు,’’ అని సమంత స్పష్టం చేశారు..!!

Aamir Khan rejects Rs 120 crore OTT deal for Sitaare Zameen Par!