in

Rajamouli and Mahesh Babu’s film to go on sets January 2025!

ఇంటర్వ్యూలో ఈ చిత్రం కథాంశం గురించి అప్‌డేట్‌ ఇచ్చిన కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌.. ఈ క్రేజీ కాంబో సినిమాపై మరో అప్‌డేట్‌ను లీక్‌ చేశారు. మాస్టర్‌ క్లాస్‌బై విజయేంద్రప్రసాద్‌ అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా ప్రారంభం కానుందని చెప్పడంతో పాటు ఈ కథను తయారుచేయడానికి రెండు సంవత్సరాల టైమ్‌ పట్టిందని తెలిపారు.

ఎస్‌ఎస్‌ఎంబీ 29 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ ప్రతిష్ఠాత్మక భారీ బడ్జెట్‌ చిత్రం గురించి ఈ అప్‌డేట్‌ను తెలుసుకున్న మహేశ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో ట్రెజర్‌ హంట్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం రాజమౌళి క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని విదేశీ భాషల్లో కూడా అనువదించడానికి ప్లాన్‌ చేస్తున్నారు. అందుకే విదేశీ నటీనటులు కూడా ఈ చిత్రంలో నటించబోతున్నారని సమాచారం..!!

WHAT IS THERE IN THE NAME?

Rajinikanth and Mani Ratnam to collaborate after 33 years!