in

Priya Anand desires to marry Nithyananda Swamy!

న దేశంలో చాలామంది స్వామిజీలు ఉన్నారు. వారిలో కొంతమంది ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటారు. అలాంటి వారిలో స్వామి నిత్యానంద ఒకరు. ఆయన పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయాడు. ప్రస్తుతం కైలాస దీవిలో ఉంటూ.. అక్కడి నుంచే తన భక్తులకు హితభోద చేస్తున్నారు. ఆయనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు ఓ హిరోయిన్ వ్యాఖ్యలు చేయడం వైరల్‎గా మారాయి..అమెరికాలో పుట్టి పెరిగినా.. సినిమాలపై మోజుతో ఇండియన్ సినీరంగంలోకి ప్రవేశించింది ప్రియా ఆనంద్. కోలీవుడ్‌లో వామనన్‌ చిత్రంతో కథానాయకిగా పరిచయం అయిన ఈ అమ్మడు..

ఆ తరువాత శివకార్తికేయన్, అధర్వ, విక్రమ్‌ ప్రభు, గౌతమ్‌ కార్తీక్, ఆర్‌జే బాలాజీకి జంటగా నటించింది. తెలుగులో లీడ‌ర్‌, రామ రామ కృష్ణ కృష్ణ, 180 సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. తాజాగా ఆమె సుశాంత్ తో కలిసి మా నీళ్ల ట్యాంక్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ జూలై 15 నుంచి జీ5లో ప్రసారం కానుంది. ఈ చిత్ర ప్రమోషన్ కోసం ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అక్కడ ప్రియా చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచనలో పడేశాయి. ఇంటర్వ్యూలో పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. తనకు స్వామి నిత్యానందను పెళ్లి చేసుకోవాలని ఉంది అని తెలిపింది..

actress Kajal Aggarwal to return to work after pregnancy!

Aamir Khan expresses his desire to work with rajamouli!