in

Raashi Khanna to mark her comeback in Bollywood!

2013లో విడుదలైన బాలీవుడ్‌ చిత్రం ‘మద్రాస్‌కేఫ్‌’తో కథానాయికగా అరంగేట్రం చేసింది ఢిల్లీ సొగసరి రాశీఖన్నా. ఆ తర్వాత దక్షిణాది బాట పట్టిన ఆమె తెలుగు, తమిళ భాషల్లో గ్లామర్‌ పాత్రలతో యువతరం ఆరాధ్యనాయికగా మారిపోయింది. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత రాశీఖన్నా బాలీవుడ్‌ సినిమాను అంగీకరించింది. ధర్మ ప్రొడక్షన్స్‌ పతాకంపై అగ్ర నిర్మాత కరణ్‌ జోహార్‌ ఓ భారీ యాక్షన్‌ సినిమాను తెరకెక్కించబోతున్నారు.

సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో దిశాపటాని, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. రాశీఖన్నా పాత్ర నెగెటివ్‌ షేడ్స్‌తో ప్రయోగాత్మక పంథాలో సాగుతుందని చిత్రబృందం తెలిపింది. తన కెరీర్‌లో మోస్ట్‌ చాలెంజింగ్‌ క్యారెక్టర్స్‌లో ఇది ఒకటని రాశీఖన్నా చెప్పింది. పుష్కర్‌ ఓజా, సాగర్‌ ఆంబ్రే దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం రాశీఖన్నా హిందీలో షాహిద్‌కపూర్‌, అజయ్‌దేవ్‌గణ్‌లతో వెబ్‌సిరీస్‌లను చేస్తున్నది.

romantic beauty ketika sharma waiting for offers!

south beauty Amala Paul loses a big Telugu movie!