in

telugu actress Madhavi Latha ‘abused’ on social media!

సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత సోషల్ మీడియాలో తనపై వస్తున్న దుష్ప్రచారాలపై గురువారం సైబర్ క్రైంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాధవీ లత మాట్లాడుతూ.. మొదటి నుండి తనపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. దేవాలయాల అంశం గురించి మాట్లాడిన తర్వాత వేధింపులు ఎక్కువయ్యాయని, వాట్సాప్ లలో కొన్ని గ్రూపులు స్క్రీన్ షాట్ లు చేసి మరి ఫార్వర్డ్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అనవసరంగా తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని పట్టుకోకపోతే మౌనదీక్షకు దిగుతానని మాధవీ లత తెలిపారు. సోషల్ మీడియాలో తనపై అసభ్యకర పోస్ట్‌లు పెడుతున్నారని.. సోషల్ మీడియా పోస్టింగ్‌లపై సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై పోరాటం చేస్తున్నామని మాధవీ లత పేర్కొన్నారు.

zombie reddy!

Satya Dev bags a special role in Chiranjeevi’s ‘Lucifer’ remake!