in

rakul preet singh resumes shooting in rain!

కుండపోతగా వర్షం కురుస్తున్నా వృత్తిపట్ల నిబద్ధతను చాటుకుంటోంది రకుల్‌ప్రీత్‌సింగ్‌. వర్షంలోనే షూటింగ్‌లో పాల్గొంటున్నది.  రకుల్‌ప్రీత్‌సింగ్‌, వైష్ణవ్‌తేజ్‌  ప్రధాన పాత్రలో క్రిష్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది.  ప్రస్తుతం వికారాబాద్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నారు.  వాన తాలూకు సన్నివేశాల్ని నిజమైన వర్షంలో చిత్రీకరిస్తున్నామంటూ ఈ సినిమా షూటింగ్‌ అనుభవాల్ని సోషల్‌మీడియా ద్వారా రకుల్‌ప్రీత్‌సింగ్‌ వెల్లడించింది. ‘వర్షం నుంచి మమ్మల్ని మేము కాపాడుకుంటూ కెమెరా తడవకుండా జాగ్రత్తపడుతూ షూటింగ్‌ చేస్తున్నాం.

కరోనా చాలదన్నట్లుగా హైదరాబాద్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. అయినా ఈ అడ్డంకులేవీ మా పనిని ఆపలేవు’ అంటూ రకుల్‌ప్రీత్‌సింగ్‌ చెప్పింది. ‘కొండపొలం’ అనే నవల ఆధారంగా ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. గత నెలలో డ్రగ్స్‌ కేసులో భాగంగా నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో విచారణకు హాజరైన రకుల్‌ప్రీత్‌సింగ్‌ ఇటీవల తిరిగి సినిమా చిత్రీకరణలో భాగమైంది.

PRABHAS ‘RADHE SHYAM’ FIRST LOOK IS OUT!

adithi rao out, rashi khanna in!