in

3 heroines onboard for Superstar Rajinikanth’s next!

జైభీమ్ ఫేమ్ టీజీ జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జినీ త‌న కొత్త చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళంలో అగ్ర నిర్మాణ‌ సంస్థ‌ల్లో ఒక‌టైన లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని నిరిస్తోంది. ఈ సినిమా షూట్ మొద‌ల‌వుతున్న సంద‌ర్భంగా కాస్ట్ అండ్ క్రూ వివ‌రాలు వెల్ల‌డించింది లైకా ప్రొడ‌క్ష‌న్స్. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు న‌టిస్తుండ‌టం విశేషం. అందులో ఒక‌రు మ‌ల‌యాళ సీనియ‌ర్ న‌టి మంజు వారియ‌ర్ కాగా..మ‌రొక‌రు గురు ఫేమ్ రితికా సింగ్. వీరికి తోడు దుషారా విజ‌యన్ అనే మ‌రో అమ్మాయి కూడా న‌టిస్తోంది..

ఐతే వీరిలో ఒక్క మంజు మాత్ర‌మే ర‌జినీకి జోడీ కావ‌చ్చ‌ని భావిస్తున్నారు. రితికా, దుషారాల‌వి క్యారెక్ట‌ర్ రోల్స్ అయి ఉండొచ్చు. చిన్న వ‌య‌స్కులైన వీళ్లిద్ద‌రూ ర‌జినీకి జోడీగా న‌టించే అవ‌కాశాలు లేవు. మంజు ఇంత‌కుముందు అసుర‌న్ మూవీలో ధ‌నుష్‌కు జోడీగా న‌టించ‌డం విశేషం. ఇప్పుడు ఆయ‌న మామ ర‌జినీకి జోడీగా న‌టిస్తే అది విశేష‌మే అవుతుంది. జైల‌ర్ సినిమాను మ‌రో రేంజికి తీసుకెళ్లిన సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద‌రే ఈ చిత్రానికి కూడా సంగీతం స‌మ‌కూరుస్తున్నాడు..!!

bollywood beauty Janhvi kapoor Purchase A Luxurious Flat In Hyderabad?

career defining time for rashmika mandanna!