in

‘Vijay And Samantha Injured In Kashmir’: It’s a Fake

విజయ్ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం “ఖుషి”.. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ లో చోటు చేసుకున్న ఘటన తో విజయ్ దేవరకొండ తో పాటు సమంతకు కూడా గాయాలైనట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. కాశ్మీర్ లోని పహాల్గాం ప్రాంతంలో స్టంట్ సెక్వెన్స్ చేస్తుండగా ఈ ఘటన జరిగిందని వచ్చే వార్తలపై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది.

ఖుషి సినిమా షూటింగ్ లో విజయ్ దేవరకొండ, సమంత కు గాయాలు అంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన ఆ చిత్ర యూనిట్.. అందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. కశ్మీర్లో 30 రోజుల షూటింగ్ కంప్లీట్ చేసుకొని అంతా హైదరాబాద్ చేరుకున్నామని ఓ ప్రకటన ద్వారా క్లారిటీ ఇచ్చింది ఖుషి టీమ్. కాగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీ.. డిసెంబర్ 23వ తేదీన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

MAA BALAYYA BANGARAM!

Kangana Ranaut Hot Blenders pride Fashion Tour!