in

Trivikram’s multi-starrer with Pawan Kalyan and Venkatesh?

తాజాగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వెంక‌టేష్ హీరోలుగా త్రివిక్ర‌మ్ ఓ మ‌ల్టీ స్టార‌ర్ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. త్రివిక్రమ్‌కి పవన్ కళ్యాణ్ మరియు వెంకటేష్‌లతో చాలా సాన్నిహిత్యం ఉంది. అజ్ఞాతవాసి సినిమా స‌మ‌యంలోనే ప‌వ‌న్‌- వెంక‌టేష్‌ల‌పై కొన్ని కీలక స‌న్నివేశాలు తెర‌కెక్కించాడు త్రివిక్ర‌మ్. ప‌లు కారణాల వల్ల ఫైనల్ కట్ నుండి తొలగించబడ్డాయి. ఇప్పుడు త్రివిక్రమ్.. పవన్, వెంకటేష్ లతో మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఇదే విష‌యంపై త్రివ‌క్రమ్ ఇద్ద‌రు హీరోల‌ను సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తుంది.

ఈ ప్రాజెక్ట్‌పై పవన్ మరియు వెంకటేష్ ఇద్దరూ ఉత్సాహంగా ఉన్నారు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది. గతంలో ప‌వ‌న్- వెంక‌టేష్ క‌లిసి గోపాల గోపాల సినిమాలో న‌టించారు. ఆ సినిమా మంచి హిట్ అవ్వ‌డ‌మే కాక వెంకీ- ప‌వ‌న్ మ‌ధ్య మంచి బాండింగ్ ఏర్ప‌డేలా చేసింది. ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం భీమ్ల నాయక్ మరియు మ‌హేష్ 28వ సినిమా పై దృష్టి పెట్టారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వకీల్ సాబ్ సినిమాతో మరోసారి సంచలనం సృష్టించిన పవన్.. ఇప్పుడు రీమేక్ చిత్రాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్.. మలయాళం రీమేక్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిస్తున్న భీమ్లా నాయక్ చిత్రంలో నటిస్తున్నాడు.

young tiger NTR reacts to AP Assembly incident!

lijomol jose reveals she ate rats for ‘jai bhim’ movie!