in

this is why ‘merupu’ cancelled!

రెంజ్’ చిత్రం తర్వాత ధరణి డైరెక్షన్లో ‘మెరుపు’ అనే చిత్రాన్ని మొదలుపెట్టాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్. పవన్ కళ్యాణ్ తో ‘బంగారం’ చిత్రాన్ని తెరకెక్కించిన ధరణి..తన దగ్గర ఉన్న కథతో చిరు, చరణ్ లను సింగిల్ సిట్టింగ్లో మెప్పించాడు.’సూపర్ గుడ్ ఫిలిమ్స్’ అధినేత ఆర్.బి.చౌదరి నిర్మాత.దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. కాజల్ హీరోయిన్. వినడానికే అదిరిపోయే కాంబినేషన్ ఇది. మొదటి షెడ్యూల్ గా 15 రోజుల షూటింగ్ కూడా జరిగింది. కానీ తర్వాత సడెన్ గా ఈ చిత్రం షూటింగ్ ను ఆపేసారు. దానికి గల కారణాలు ఏంటి? అనేది ఇప్పటివరకూ చాలా మందికి తెలీదు. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రం స్క్రిప్ట్ ను రెడీ చేసాడు దర్శకుడు ధరణి. 15 రోజుల షూటింగ్ కే.. అంటే మొదటి షెడ్యూల్ కే 10 కోట్లు.. నిర్మాతతో ఖర్చు పెట్టించడాట. దాంతో నిర్మాతకు టెన్షన్ వచ్చి ధరణిని అలాగే చిరు, చరణ్ లను కూర్చోపెట్టి..బడ్జెట్ గురించి డిస్కస్ చేసాడట.దాని వల్ల తేలింది ఏంటి అంటే.. పారితోషికాలు కాకుండానే ఈ ప్రాజెక్ట్ కు 35 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని తెలిసిందట. అసలే ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ ను నమ్మి అంత పెద్ద మొత్తం పెట్టడానికి నిర్మాత కూడా వెనుకడుగు వేసాడట. అయితే ఫ్యూచర్ లో ఈ చిత్రాన్ని కచ్చితంగా చేద్దాం అని డైరెక్టర్ ధరణికి మాటిచ్చారట చిరు,చరణ్. అయితే నిర్మాతకి సినిమా కమిట్ అవ్వడంతో ‘మెరుపు’ బదులు.. ‘రచ్చ’ చిత్రాన్ని చరణ్ చేసినట్టు తెలుస్తుంది

romantic heroine signs another movie!

upasana about her married life!