in

telugu girl Manasa Varanasi to replace mamitha baiju!

ర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘జార్జ్ క్రిష్’. ఐతే, ఈ సినిమాలో హీరోయిన్‌ గా మమితా బైజును ఫిక్స్ చేసినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు మరో పేరు వినిపిస్తోంది. హీరోయిన్ మానస వారణాసిను ఫైనల్ చేసే ఆలోచనలో టీమ్ ఉందని తెలుస్తోంది. మరి ఈ వార్త నిజం అయితే.. మమితా బైజు సినిమా మానస వారణాసికి వెళ్ళిపోయినట్టే.

ఇక మరోవైపు శర్వానంద్ ఇప్పటికే ఈ సినిమా కోసం తన లుక్ పై కసరత్తులు చేస్తున్నాడు. బైకర్ కోసం సన్నబడ్డ శర్వా.. ఈ సినిమా కోసం కొంచెం వెయిట్ పెరగబోతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఐతే, గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడు..!!

bollywood beauty Nargis Fakhri to sizzle in Balayya’s next!