
ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నటి సాయి పల్లవి. ఆమె పోషించిన భానుమతి పాత్ర ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. అయితే, ఆ పాత్ర అంతగా పండటం వెనుక ఆమె అంకితభావం, పట్టుదల ఉన్నాయి. దర్శకుడు శేఖర్ కమ్ముల ‘ఫిదా’ కథతో సంప్రదించినప్పుడు, సాయి పల్లవి జార్జియాలో ఎంబీబీఎస్ చివరి దశలో ఉన్నారు..
సినిమా చేయడానికి వెంటనే అంగీకరించినప్పటికీ, తన చదువు పూర్తి చేయడానికి ఆరు నెలల సమయం కావాలని దర్శకుడిని కోరారు. ఆమె నిబద్ధతను అర్థం చేసుకున్న శేఖర్ కమ్ముల అందుకు అంగీకరించారు. 2016లో డిగ్రీ పూర్తి చేసుకుని వచ్చిన సాయి పల్లవి, ఆ తర్వాత ‘ఫిదా’ కోసం సిద్ధమయ్యారు. తమిళనాడుకు చెందిన ఆమెకు తెలంగాణ యాసలో మాట్లాడటం పెద్ద సవాలుగా మారింది..!!
