in

samantha out aishwarya in!

RX 100 లాంటి భారీ హిట్ తర్వాత దర్శకుడు అజయ్ భూపతి ‘మ‌హాస‌ముద్రం’ అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. దీనికి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్ మెంట్‌ ని తాజాగా చిత్రనిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ ఇచ్చింది. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తర్వాత తమ బ్యానర్ నుంచి వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ అంటూ వెల్లడించింది. ఇక ఈ సినిమాలో సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా నటిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ల ఎంపిక పట్ల బాగానే కసరత్తు చేస్తున్నారు మేకర్స్.. ముందుగా ఓ పాత్ర కోసం హీరోయిన్ గా సమంతని అనుకున్నారట దర్శకుడు అజయ్ భూపతి.. అయితే ఆమెకు కథ వివరించగా పాత్ర నచ్చి ఒకే చెప్పినట్లు వార్తలు వచ్చిన వచ్చాయి.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి సమంత తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల వలన సమంత ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా సమాచారం.

‘dollar dreams’ venakunna asalu katha!

ntr to play nri role in his next?