
ప్రస్తుతం పూరి తన కుమారుడు ఆకాష్ పూరి హీరోగా ‘రొమాంటిక్’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో కథానాయికగా కేతిఖా శర్మ అనే కొత్తమ్మాయిని తీసుకున్నారు. పోస్టర్లు, సాంగ్ టీజర్లతోనే కేతిక శర్మ తెలుగు యువతకు బాగా నచ్చేసింది. సోషల్ మీడియాలో అమ్మడి బోల్ద్ ట్రీట్ కు కుర్రకారు దాసోహం అంటోంది. దీంతో ఆమెకు ‘రొమాంటిక్’ విడుదలకు ముందే కొత్త ఆఫర్లు వస్తున్నాయట. తాజాగా నాగశౌర్య కొత్త చిత్రంలో కథానాయికగా కేతిక శర్మను అనుకుంటున్నట్టు టాక్ వినబడుతోంది. అలాగే సుశాంత్ కొత్త సినిమాలో కూడా కేతికానే హీరోయిన్ గా తీసుకుంటున్నారట.

