in

rashmi gautham fires on airport security!

తెలుగు బుల్లితెర అందాల తార యాంకర్ రష్మీ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సిబ్బంది పై ట్విట్టర్ లో మండిపడింది. దేశంలో రోజురోజుకు కరోనా ప్రభావంతో బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. నిన్నటి వరకు వందలోపే నమోదైన కరోనా కేసులు నేడు వంద పైనే నమోదవడంతో ప్రజలలో ఆందోళన నెలకొంది. అయితే శంషాబాద్ ఎయిర్ పోర్టులో కరోనా నియంత్రణకు అక్కడి సిబ్బంది తీసుకుంటున్న చర్యలపై రష్మీ ట్వీట్లతో ఫైర్ అయింది.గతరాత్రి రష్మీ ఎయిర్ పోర్టులో సిఐఎస్ఎఫ్ సిబ్బంది మాత్రమే మాస్క్ ధరించి ఉన్నారని హ్యాండ్ శానిటైజర్ అడిగితే వెతుకుతున్నారని చెప్పింది. అయితే కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవడం పై తాను అసహనం వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలిపింది. ఎందుకంటే ఎయిర్ పోర్టు లో ఇంటర్నేషనల్ ప్రయాణికులకు మాత్రమే చర్యలు తీసుకుంటున్నారని డొమెస్టిక్ ప్రయాణికులకు ఎందుకు తీసుకోవట్లేదని..? రష్మీ ప్రశ్నించింది.

ఆ వెంటనే మరో ట్వీట్ తో నేనేమి ఎయిర్ పోర్ట్ సిబ్బందిని నిందించడం లేదంటూ అమ్మడు సర్దిచెప్పుకుంది. మరి గ్లామర్ డాల్ రష్మీ మండిపడితే ఆ సంస్థ స్పందించకుండా ఉంటుందా.. “యాంకర్ మేడం! ప్రయాణికుల ఆరోగ్యమే మాకు ముఖ్యం. వారి సౌకర్యార్థమే మేము ఈ చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే డొమెస్టిక్ ప్రయాణికులకు కూడా చర్యలు తీసుకుంటాం” అంటూ జవాబిచ్చింది. దీనితో యాంకర్ అమ్మ కోపం తగ్గిందనే అంతా భావిస్తున్నారు.

CHIRU CINEMAKI MUSIC ANDHINCHINA R.P. PATNAYAK!

most desirable women Samantha!