in

rajamouli: appudu varma, ippudu vanga

యానిమల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రాజమౌళి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో పాటు రణబీర్ కపూర్ పై ప్రశంసలు కురిపించారు. అప్పట్లో వర్మ లాగే, ఇప్పుడు వంగా సంచలనాలు క్రియేట్ చేయబోతున్నారని చెప్పుకొచ్చారు. “ ప్రతి ఏటా ఏంతో మంది కొత్త డైరెక్టర్లు వస్తారు. మంచి సినిమాలు తీస్తారు. చక్కటి పేరు సంపాదిస్తారు. కానీ, కొంత మంది దర్శకులు ఎప్పుడో ఒకసారి ప్రేక్షకులతో పాటు యావత్ సినిమా పరిశ్రమనే షేక్ చేస్తారు.

సినిమా ఇలాగే తీయాలనే ఫార్ములాను కూడా బద్దలు కొడతారు. అలాంటి దర్శకులలో నా తరానికి చెందిన వారు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు  సందీప్ రెడ్డి వంగా. సినిమాను ఇలాగే తీయాలనే రూల్ ను పక్కన పెట్టి, నేను ఇలాగే సినిమా చేస్తా అనే డైరెక్టర్ సందీప్. ఆయనను చూసి గర్విస్తున్నాను. నిజానికి ‘యానిమల్’ టీజర్ చూడగానే వెంటనే సినిమా చూడాలి అనిపించింది” అని రాజమౌళి వెల్లడించారు..!!

samantha praises and calls it ‘movie of the year’!

lady superstar Nayanthara To Make Her Directorial Debut?