in

puri to work with balakrishna again!

టసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడన్న గుసగుసలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన స్టోరీలైన్ ను పూరీ జగన్నాథ్ బాలకృష్ణకు వినిపించారని, దీనికి బాలయ్య ఇంప్రెస్ అయ్యారని సమాచారం. త్వరలోనే బాలయ్య, పూరీ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. పూరీ  జగన్నాథ్ దర్శకత్వంలో బాలయ్య పైసా వసూల్ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఆశించిన మేర విజయవంతం కాలేదు. ఈ క్రమంలోనే బాలయ్యతో రెండో సినిమా తీసి మంచి విజయం సాధించాలన్న పట్టుదలతో పూరీ జగన్నాథ్ ఉన్నట్టు తెలుస్తోంది.

keerthy suresh to play chiranjeevi’s sister!

sharwanand grabs venky’s rejected projected!