in

PRABHAS DONATES 4 CRORES!

టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రభాస్ తాజాగా ప్రధాని సహాయ నిధికి మరో మూడు కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించాడు. దీంతో మొత్తం ప్రభాస్ ప్రకటించిన విరాళం నాలుగు కోట్లకు చేరుకుంది. ప్రభాస్ ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయల విరాళం ప్రకటించాడు. కాగా ప్రపంచాన్ని అల్లాడిస్తున్న కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి.దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా రోజువారీ కూలీలు సహా ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు యావత్ దేశం ముందుకొచ్చింది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు, క్రీడాకారులు కూడా తమ వంతు సాయాన్ని ప్రకటిస్తున్నారు.

ఇక టాలీవుడ్‌లో గత 10 రోజులుగా సూటింగ్‌లు ఆగిపోవడం వల్ల ఇండస్ట్రీలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి కూడా సహాయం అందించేందుకు సెలబ్రిటీలు ముందుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, నితిన్, తివిక్రమ్, దిల్ రాజు, సాయితేజ్, అల్లరి నరేష్ వంటివారు తమ వంతు సహాయాన్ని అందించారు. ఇక అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ప్రభాస్ రెండు సార్లు సాయం ప్రకటించడం గమనార్హం.

CUTE SREEMUKHI !

TOLLYWOOD STARS DONATION FOR CORONA!