in

Prabhas and Nayanthara likely to reunite after 16 years!

పాన్ ఇండియా స్టార్లు ప్రభాస్-నయనతార మళ్లీ కలిసి నటించబోతున్నారట. 2007లో యోగి సినిమాలో జంటగా నటించిన ఈ ఇద్దరు ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత మరోసారి కలిసి కనువిందు చేయబోతున్నారు. ఇంతకీ ఈ ఇద్దరు కలిసి నటించనున్న ఆ సినిమా ఏంటో తెలుసా..మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్​ ‘కన్నప్ప’ రీసెంట్​గా పట్టాలెక్కిన విషయం తెలిసిందే. ముఖేశ్​ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్‌ ఇండియా సినిమాలో ప్రభాస్​ అతిథి పాత్రలో మెరవనున్నారని,

అది కూడా శివుడి పాత్రలో కనిపించనున్నారని ఆ మధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మంచు విష్ణు కూడా ఓ ట్వీట్​తో దీన్ని కన్ఫామ్ చేశారు. అయితే ఇదే మూవీలో ఇప్పుడు మరో పాన్ ఇండియా స్టార్.. లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా నటించబోతుందట. ప్రభాస్ శివుడి పాత్రకు జోడీగా పార్వతిగా నయన్ కనిపించనుందని అంటున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ప్రభాస్-నయనతార​.. యోగీ సినిమా తర్వాత అంటే దాదాపు 16ఏళ్ల తర్వాత కలిసి నటించినట్టవుతుంది..!!

can you guess how many times these heroes died in movies!

rashmika clarifies rumors about ravi teja’s movie!