
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే టాలీవుడ్ లో దూసుకెళ్తోంది. బాలీవుడ్ లో సత్తా చాటుతోంది. కోలీవుడ్ లోనూ మొదలెట్టేసింది. లాక్డౌన్తో ఇంటికే పరిమితమైన సినీ తారలు సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తున్నారు. తాజాగా లైవ్ చాట్లో పాల్గొన్న బుట్టబొమ్మ పూజా హెగ్డే పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తనకు ఇష్టమైన క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ అని తెలిపింది. ఈ తరంలో ఎంతమంది గొప్ప ఆటగాళ్లు ఉన్నా అతడికి సాటిరారని తేల్చిచెప్పారు. ది వాల్ ఓ కూల్ అండ్ క్లాసిక్ ప్లేయర్ అని పేర్కొన్నారు. ప్రస్తుత ఆటగాళ్లలో ధోని, కేఎల్ రాహుల్ ఆటతీరు నచ్చుతుందన్నారు. ఇక ఎంత బిజీగా ఉన్నా టీమిండియా మ్యాచ్ జరుగుతుంటే కనీసం స్కోర్ తెలుసుకోవడానికైనా ప్రయత్నిస్తానని క్రికెట్ పట్ల తనకున్న ఇష్టం గురించి తెలిపింది పూజా.

