in

Pooja hegde reveals the reason to buy a house in Mumbai!

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి మంచి ఫేమ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకెళ్తోంది. అయితే బుట్టబొమ్మ తాజాగా ముంబైలో ఇల్లు కొనుక్కుంది. అతితక్కువ అతిథుల హాజరుతో కొన్ని వారాల క్రితం గృహప్రవేశ వేడుక కూడా జరిగింది. చాలా రోజులుగా హైదరాబాద్‌లో పని చేస్తున్న పూజ ముంబైలో ఎందుకు ఇల్లు కొనుక్కుందో చాలా మందికి అర్థం కాలేదు. అయితే ఇప్పటికీ చాలామంది మదిలో మెదులుతున్న ఈ ప్రశ్నకు తాజాగా పూజా సమాధానం ఇచ్చింది. ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా మాట్లాడుతూ ముంబైలో ఇల్లు కొనడానికి కారణం తన కుటుంబంతో సన్నిహితంగా ఉండాలనే కోరిక అని చెప్పింది.

“నా కుటుంబం ముంబైలో నివసిస్తున్నారు. అందుకే నేను ముంబై నగరంలో ఇల్లు కొనాలని నిర్ణయించుకున్నాను” అని పూజా చెప్పుకొచ్చింది. ముంబైలో ఉండటం వల్ల ఇంట్లో వండిన ఆహారాన్ని తినే అవకాశం లభిస్తుందని, కోవిడ్-19 కారణంగా గృహ ప్రవేశ వేడుకను సైలెంట్ గా కానిచ్చేసినట్లు పూజ తెలిపింది. ఈ కార్యక్రమానికి కేవలం ఆమె సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. మరోవైపు పూజాహెగ్డే నటించిన పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్”, “ఆచార్య”, “బీస్ట్” వంటి చిత్రాలతో థియేటర్లలో రాబోయే రెండు నెలల్లో సందడి చేయనుంది.

bebamma Kriti Shetty Celebrates 1 Year Of Her Debut Film ‘Uppena’!

Deepika Padukone says she’s ‘obsessed’ with Jr NTR!