in

pooja hegde revealed about her first remuneration!

టాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరంటే అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇటీవల పూజా నటించిన చిత్రాలు ప్రేక్షకులను ఆలరించడం పక్కన పెడితే బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లు ఆమె గ్లామర్‌ స్టామినా ఏంటో తెలియజేశాయి. ప్రస్తుతం ఈ బుట్ట బొమ్మ టాలీవుడ్‌లో వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ బిజీ బిజీగా ఉంది. ఇక వరుస హిట్లు రావడంతో ఈ బ్యూటీ రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసింది. ఒక్కో సినిమాకు దాదాపు రూ. 3 కోట్ల నుంచి నూ. 5 కోట్ల వరకు వసూలు చేస్తోంది. రెమ్యునరేషన్ విషయంలో నయనతారతో పోటీ పడుతోంది.

ప్రస్తుతం ఇంత భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ బుట్ట బొమ్మ తొలి సంపాదన ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ భామ తొలిసారి జీవా హీరోగా నటించిన ‘మూగముడి’ సినిమాతొ హీరోయిన్ గా తెరంగ్రేటం చేసింది. ఈ సినిమా కోసం రూ. 30 లక్షల పారితోషకం తీసుకున్నట్టు సమాచారం. అలా తొలిసారి వచ్చిన సంపాదనతో పూజా హెగ్డే బీఎండబ్ల్యూ5 సిరీస్ బ్యూ స్టోన్ సిల్లర్ కలర్ కారును కొనుగోలు చేసిందంట. ఆ కారు అంటే పూజాకు ప్రాణం అట. ఇప్పటికీ ఆ కారు తన ఇంట్లోనే దాచుకుందట.

Telugu Anchor Anasuya bharadwaj fires on netizen!

rashi khanna roped in for gopichand’s next with maruthi!