తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజ హెగ్డే ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా పూజా హెగ్డే మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో నేను నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరుస్తున్నాయి. కొన్నాళ్లుగా నా లైఫ్ లో విజయం అనే పదానికి అర్ధం మారిపోయింది. కానీ నాకు ఈ సమయం చాలా ఇంపార్టెంట్. భవిష్యత్తులో నేను చేసే సినిమాలు నేను ఎలాంటి నటిని అనేది ప్రేక్షకులకు చుపిస్తాయని అనుకుంటున్నాను..
సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన నాలాంటి వాళ్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వారు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నా కానీ నేను సాధించాల్సింది చాలా ఉంది. అందరి జీవితంలో హెచ్చుతగ్గులు కచ్చితంగా ఉంటాయి. మేము నటులం ఫ్లాప్ లను కూడా స్వీకరించాలి. బీస్ట్ సినిమా తర్వాత ఇప్పుడు జన నాయగన్ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. కానీ ఇది విజయ్ చివరిచిత్రం అవ్వడం ఒకింత బాధగా అనిపిస్తుంది..!!