in

pawan kalyan and nithin to act together?

వర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక వరుస సినిమాలతో బీజీగా మారాడు. పవన్ చేతిలో ఇప్పటికే నాలుగు సినిమాలు ఉండగా తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దసరా సందర్భంగా పవన్ కొత్త సినిమా అప్డేట్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అధికారికంగా ప్రకటించింది. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ కె.చంద్ర ఈ మూవీకి దర్శకత్వం వహించనుండగా సూర్యదేవర నాగవంశీ సినిమాను నిర్మించనున్నాడు. దసరా సందర్భంగా ‘కింగ్ ఆఫ్ యాటిట్యూడ్.. తెలుగు సినిమా ఫేవరేట్ పోలీస్ ఆఫీసర్ మరోసారి హై ఓల్టేజ్ రోల్ తో రాబోతున్నారు’ అంటూ చిత్రబృందం ప్రకటించింది. మలయాళంలో సూపర్ హిట్టుగా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రానికి రీమేక్ గా ఈ మూవీ రానుందని సమాచారం.

ఒరిజనల్ వర్షన్లో బిజూ మీనన్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కల్యాణ్ నటించనున్నాడు. పృథ్వీరాజ్ పాత్రను దగ్గుబాటి రానా చేస్తాడనే టాక్ విన్పించింది. అయితే తాజాగా మరో హీరో పేరు తెరపైకి రావడం ఆసక్తిని రేపుతోంది. ఇటీవల నితిన్ నటించిన భీష్మ కూడా ఈ బ్యానర్లో చేసిందే. తాజాగా పవన్ కల్యాణ్ పక్కన ఆఫర్ రావడంతో వెంటనే ఒప్పకున్నాడనే టాక్ విన్పిస్తోంది. కథ రీత్య ఇద్దరు హీరోల ఇగోల వల్ల వాళ్ళ జీవితాల్లో అనుహ్య సంఘటనలు చోటుచేసుకుంటాయట. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ఢీ అంటై ఢీ అంటారు. దీంతో పవర్ స్టార్ ను తన డై హార్డ్ ఫ్యాన్ ఢీ కొట్టేందుకు సిద్ధపడుతున్నారు..

samantha thanks big boss viewers!

Mahesh Chat Story