in

Nithiin to Be Called ‘Junior’!

క్కంతం వంశీ చాలా సినిమాలకు కథలను అందించాడు. తాను కూడా దర్శకుడిగా మారిపోయి ఆ మధ్య ‘నా పేరు సూర్య’ సినిమాను తెరకెక్కించాడు. అల్లు అర్జున్ హీరోగా నిర్మితమైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దాంతో సహజంగానే వంశీకి గ్యాప్ వచ్చేసింది.
మళ్లీ ఇప్పుడు ఆయన దర్శకుడిగా తన రెండవ సినిమాతో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. నితిన్ హీరోగా ఆయన ఈ సినిమాను రూపొందించనున్నాడు.

ఈ సినిమాకి ‘జూనియర్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఠాగూర్ మధు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు..ప్రస్తుతం నితిన్ ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమా చేస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ సొంత బ్యానర్లో ఈ  సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో కృతి శెట్టి ఆయన జోడీగా అలరించనుంది. ఈ సినిమా షూటింగు పూర్తికాగానే, వక్కంతం వంశీ ప్రాజెక్టును నితిన్ పట్టాలెక్కిస్తాడన్న మాట.

surprise: ‘radhe shyam’ team reveals second heroine

Shriya Saran at ‘Gamanam’ Movie Interview!