in

‘nishabdam’ team clears the rumors!

టాలీవుడ్ క్వీన్ అనుష్క కు సంబంధించి ఏ చిన్న న్యూస్ బైటికి వచ్చిన..అది నిజమో కాదో తెలిసేలోపే ఇంటర్నర్ట్ లో సెన్సేషన్ అయిపోతుంది, మొన్నటి వరకు తన పెళ్లి పై ఎన్నో పుకార్లు వచ్చాయి..అవన్నీ విని స్వీటీ చాల బాధ పడ్డ సంగతి తెలిసిందే..తాజాగా అనుష్క గురించి ఇంకో న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.
అనుష్క తాజా చిత్రమైన ‘నిశ్శబ్దం’ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే థియేటర్స్ కి రావలసిన ఈ సినిమా, లాక్ డౌన్ కారణంగా విడుదల తేదీని వాయిదా వేసుకుంది..సినిమా ఎప్పుడు థియేటర్ లో రిలీస్ అవుతుంది ఎవరు చెప్పలేని పరిస్థితి.

అయితే ఈ సినిమాకి అమెజాన్ నుంచి భారీ ఆఫర్ వచ్చిందనే వార్త చక్కర్లు కొడుతోంది..లాక్ డౌన్ తరువాత థియేటర్స్ కి ఎంతవరకూ జనాలు వస్తారనేది సందేహమేనని సినీపెద్దలే చెబుతున్న నేపథ్యంలో, చాలా మంది అమెజాన్ కి తమ సినిమాలను ఇచ్చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. అలాగే ‘నిశ్శబ్దం’ నిర్మాతలు కూడా ఆసక్తిని చూపించారనీ, అయితే అందుకు అనుష్క అడ్డుపడిందనే ప్రచారం ఊపందుకుంది..అందరూ అమెజాన్ కు సినిమా ని ఇచ్చేదం అని ఫిక్స్ అయ్యారట, కానీ అనుష్క వద్దని చెప్పడంతో అల చేయట్లేదట. అనుష్క వ్యక్తిత్వం గురించి తెలిసిన చాలామంది ఈ ప్రచారాన్ని నమ్మలేదు. ఇదే విషయాన్ని గురించి ఈ సినిమా టీమ్ స్పందిస్తూ, ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని స్పష్టం చేసింది. ఇలాంటి వార్తలను నమ్మవద్దంటూ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది.

RGV CHALLENGES C.M KCR!

ACTORS PRODUCTION HOUSE NAMES!