in

nayanthara breaking the rules for movie promotions!

సాధారణంగా ఏ ఇండస్ట్రీలోనైనా సరే సినిమా ప్రమోషన్స్ లో సెలబ్రిటీలే కాకుండా డైరెక్టర్లు, నిర్మాతలు, టెక్నీషియన్స్ వంటి వారు పాల్గొంటూ ఉంటారు. అగ్ర హీరోయిన్ గా పేరు సంపాదించిన నయనతార ఇలాంటి నియమాలు అన్నీ కూడా పట్టించుకునేది కాదు. గడిచిన కొన్నేళ్ల క్రితం నుంచే నయనతార ఎలాంటి సినిమా ఈవెంట్స్ కి, ప్రమోషన్స్ కి సైతం పాల్గొనకుండా దూరంగా ఉంటూ ఉండేది. ముఖ్యంగా చిరంజీవి, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోల చిత్రాలు అయినప్పటికీ ఆమె కండిషన్ ని మాత్రం అప్లై చేస్తూ ఉండేది. అయితే తాజాగా ఈ రూల్ ని బ్రేక్ చేసినట్టుగా తెలుస్తోంది.

తమిళ చిత్రం నేసిప్పయ అనే సినిమా ప్రమోషన్స్ ఈవెంట్లో నయనతార పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. అదితి శంకర్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సమయంలో ప్రమోషన్స్ నీ వేగవంతం చేసింది చిత్ర బృందం..ఈ ప్రమోషన్స్ లో నయనతార పాల్గొనడానికి ఒక ముఖ్య కారణం ఉందట. అదేమిటంటే.. నయనతార విష్ణువర్ధన్ డైరెక్షన్లో వచ్చిన బిల్లా సినిమా నయనతార కెరియర్నే మార్చేసింది. అంతేకాకుండా విష్ణువర్ధన్ కూడా నయనతార కుటుంబ సభ్యుడి లాంటివాడని..తనమీద అభిమానాన్ని ఇలా ప్రమోషన్స్ రూపంలో చూపించిందట..!!

F Cube: Everything About Kalki 2898 AD

Prithviraj As Villain In Mahesh Babu – Rajamouli SSMB29?