in

nagarjuna heroine Anshu returns to Tollywood!

మాస్ యాక్షన్ సినిమాలు చేయడంలో నక్కిన త్రినాథరావుకి మంచి నైవుణ్యం ఉంది. ఆయన నుంచి ఆ మధ్య వచ్చిన ‘ధమాకా’ సినిమా, వసూళ్ల పరంగా దూసుకెళ్లింది. ఆ తరువాత ప్రాజెక్టును ఆయన సందీప్ కిషన్ హీరోగా పట్టాలెక్కిస్తున్నాడు. ఈ పాటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లవలసి ఉంది. కొన్ని కారణాల వలన ఆలస్యమైంది. ఈ సినిమా కోసం ‘స్టిల్ బ్యాచ్ లర్’ .. ‘రేంజ్ మాస్టర్’ అనే టైటిల్స్ ను పరిశీలించారు.

అయితే ‘ధమాకా’ టైటిల్ సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని ‘మజాకా’ అనే టైటిల్ ను దాదాపు ఫిక్స్ చేసినట్టుగా సమాచారం. ఈ సినిమాలో కథానాయికగా రీతూ వర్మ కనిపించనుంది. రాజేశ్ దండా ఈ సినిమాకి నిర్మాత. ఈ సినిమాలో సందీప్ కిషన్ తండ్రిగా రావు రమేశ్ నటిస్తున్నాడు. ఇక హీరోకి తల్లిగా ‘మన్మథుడు’ బ్యూటీ అన్షూ కనిపించనుంది.  ‘మన్మథుడు’ సినిమాతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఆమె, ఈ సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తోంది..!!

jr ntr prashanth neel shooting will happen in 15 countries!

16 years for dubai seenu!