in

Mythri Movie Makers confirm project with Jr NTR and Prashanth Neel!

KGF వంటి భారీ చిత్రంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్. కేజీఎఫ్ మొదటి భాగం అన్ని భాషల్లోనూ భారీ విజయం సాధించడంతో.. ఈ సీక్వెల్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. ‘కేజీఎఫ్’ సీక్వెల్ జులై 16న థియేటర్లకు రానుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ‘సలార్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో త‌న నెక్ట్స్ చిత్రంపై ఫోకస్ పెట్టాడు ప్రశాంత్‌. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా ఓ పాన్‌ ఇండియా మూవీ తెర‌కెక్కించ‌డానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు అప్పట్లోనే వార్తలు చక్కర్లు కొట్టాయి.

తాజాగా టాప్ నిర్మాణ సంస్థ‌ మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రశాంత్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్నీ ఆ సంస్థ అధికారికంగా ప్రకటించాక పోయినప్పటికీ ఒక్కసారిగా వచ్చిన వార్తలతో ఎన్టీఆర్ #NTR31 ట్రెండింగ్ అవుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్, ఈ సినిమా తరువాత దర్శకుడు త్రివిక్రమ్ తో చేయనున్నాడని సమాచారం. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్, ఎన్టీఆర్ లు చేస్తున్న ప్రాజెక్ట్ ల తరువాత వీరి కాంబినేషన్ మొదలుకానుందని తెలుస్తోంది.

Mahesh Babu To Play Lord Ram In Madhu Mantena’s ‘ramayana’?

release date locked for vijay devarakonda’s ‘liger’!