in

MANI RATNAM BREAKS SILENCE ON FILM WITH MAHESH BABU!

యన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవనో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ తెలుగు హీరోలు మాత్రం మణిరత్నంతో సినిమా అంటే వెనుకడుగు వేస్తారు. అయితే ఈ మధ్యకాలంలో మణిరత్నం ఓ కథ పట్టుకొని టాలీవుడ్ స్టార్ హీరోల చుట్టూ తిరిగారు. కానీ మనవాళ్లు మాత్రం ముందుకు రాలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబుని కలిశారు మణిరత్నం. వీరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించారు మణిరత్నం. మహేష్ ని కలిసిన మాట నిజమేనని..

ఆయనతో సినిమా కూడా చేయాలనుకున్నానని మణిరత్నం చెప్పారు. ఆయనతో కథా చర్చలు జరిగాయని.. కానీ కుదరలేదని అన్నారు. భవిష్యత్తులో మంచి కథ దొరికితే మహేష్ తో సినిమా చేస్తానని చెప్పారు. నాగచైతన్య, రామ్ లాంటి యంగ్ హీరోలను కూడా మణిరత్నం సంప్రదించారు. కాయి వాళ్లు కూడా నో చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం మణిరత్నం ‘నవరస’ అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. దీనికి ఆయన నిర్మాత మాత్రమే. నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Shraddha Das Is A Pretty Doll In these Saree Pics!

Nivetha Pethuraj becomes a certified Formula one car racer!