in

Mahesh Babu gives chance to female director?

సూపర్ స్టార్ మహేష్ తాజాగా చేస్తున్న సినిమా సర్కారు వారి పాట. గతేడాది సరిలేరు నీకెవ్వరూ సినిమా తరువాత మహేష్ చేస్తున్న సినిమా ఇది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఈ చిత్రం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇందులో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మహానటి కీర్తిసురేష్ చేస్తోంది.  ఈ సినిమా బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతోందని టాక్‌.

ఇక ఈ సినిమా షూటింగ్‌ నిమిత్తం చిత్ర బృందం ఇటీవలే దుబాయ్‌కు వెళ్లింది. ఇది ఇలా ఉంటే.. మహేష్‌బాబు ఈ మూవీ తర్వాత మరో సినిమాను చేయనున్నాడట. అది కూడా ఓ లేడీ డైరెక్టర్‌తో కావడం విశేషం. గురు, ఆకాశమే నీ హద్దురా లాంటి సినిమాలతో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న మహిళా దర్శకురాలు సుధ కొంగర…. ప్రిన్స్‌ మహేష్‌ కోసం ఇప్పటికే ఓ కథను సిద్ధం చేసిందట. త్వరలోనే ఈ కథపై చర్చలు కూడా జరుగనున్నాయని టాక్‌ నడుస్తోంది..

Ravi Teja to romance Nani’s heroine priyanka!

eesha rebba to play key role in gunashekar’s ‘Shaakuntalam’!