in

eesha rebba to play key role in gunashekar’s ‘Shaakuntalam’!

అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో హీరోయిన్‏గా పరిచయమయ్యింది వరంగల్ అమ్మాయి ఈషా రెబ్బా. ఆ మూవీ తర్వాత బందిపోటు, అమీ తుమీ వంటి సినిమాల్లో నటించిన.. ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదు. ఆ తర్వాత హీరోయిన్‏గా కాకుండా కీలక పాత్రల్లో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ బ్యూటీ సూపర్ ఛాన్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. పౌరాణిక ఇతిహాసం ఆధారంగా డైరెక్టర్ గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమాను నిర్మిస్తున్నా సంగతి తెలిసింది.

మహాభారతంలోని ఆదిపర్వంలోగల దుష్యంతుడు, శాకుంతలం ప్రేమ కథ నేపథ్యంలో ఈ మూవీ రానుంది. అయితే ఇందులో శకుంతల పాత్రలో హీరోయిన్ సమంత నటించనున్నట్లుగా ఇప్పటికే ప్రకటించింది చిత్రయూనిట్. ఇక దుష్యంతుడి పాత్రలో ఎవరు నటించనున్నారనే విషయం గురించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు…ఈ మూవీలో మరో హీరోయిన్ కూడా నటించనున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో తెలుగమ్మాయి ఈషారెబ్బా నటించనున్నట్లుగా తెలుస్తోంది.

Mahesh Babu gives chance to female director?

rakul preet singh giving more importance to bollywood!