in

last 48 hours have been beyond painful for my family: kriti

సెకండ్‌ వేవ్‌లో విజృంభిస్తున్న కరోనాకు ఎంతోమంది బలవుతున్నారు. ఆక్సిజన్‌ కోసం మరెంతో మంది చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో అనవసరంగా ఇల్లు దాటి ఇబ్బందులకు గురి కావొద్దంటూ బాలీవుడ్‌ హీరోయిన్‌ కృతి కర్బందా అభిమానులను అభ్యర్థించింది. తను అనుభవించిన బాధ ఎవరికీ రాకూడదంటూ ట్వీట్‌ చేసింది. ‘గత 48 గంటల్లో నేను..

నా కుటుంబ సభ్యులు ఎంతో నరకం అనుభవించాం..మీకు అనుభవమయ్యేవరకూ ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలియదు. కాబట్టి దయచేసి ఇంట్లోనే ఉండండి. మీరు బయటకు వెళ్లాలనుకుప్పుడు మీ ప్రాణాన్ని రిస్క్‌లో పెడుతున్నారని గ్రహించి వెనకడుగు వేయండి. మీ ప్రాణాలను, జీవితాలను లైట్‌ తీసుకోకండి..’ అని కృతి చెప్పుకొచ్చింది. ఇది చూసిన జనాలు ఆమె ఫ్యామిలీ కరోనా బారిన పడినట్లుందని భావిస్తున్నారు.

Thalapathy Vijay to do a straight Telugu film soon?

How much do you know about senior NTR!