in

Krishnam Raju to be appointed as Tamil Nadu governor?

బీజేపీ సీనియర్ నాయకుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజుకు హైకమాండ్ పెద్ద పదవినే కట్టబెట్టనుందని ప్రచారం జరుగుతోంది. తమిళనాడు గవర్నర్ పదవిని అప్పగించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ఇంకా కన్ఫర్మేషన్ కూడా అవలేదు.. ఈ లోపే బీజేపీ నేతకు అభినందనలు తెలుపుతూ ట్వీట్స్ చేసేస్తున్నారు. మరోవైపు ఈ వార్త తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో మునిగిపోయారు. ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన కృష్ణం రాజు.. శ్యామలా దేవిని పెళ్లాడారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కెరీర్ స్టార్టింగ్‌లో ఆయన జర్నలిస్టుగా పని చేశారు. 1966లో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి కళారంగంలో సేవలు అందించారు. 2014లో కేంద్రంలోకి బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణకు చెందిన విద్యాసాగర్ రావును మహారాష్ట్ర గవర్నర్‌గా ఎంపిక చేశారు. కొద్ది కాలంపాటు తమిళనాడు ఇన్‌ఛార్జ్ గవర్నర్‌గానూ వ్యవహరించారు.

KGF Chapter 2 Teaser Breaks The Internet!

Malavika Sharma opens her mouth on casting couch!