in

Kiara Advani recalls her near-death experience in Dharamshala!

టు బాలీవుడ్‌ ఇటు టాలీవుడ్‌లో ఇరగదీస్తోంది కియారా అద్వానీ. హిట్, ఫ్లాప్‌ సినిమాలతో సంబంధం లేకుండా బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది. తెలుగులో ప్రస్తుతం RC15 సినిమా చేస్తుంది. ఇటీవలే బాలీవుడ్ యువ హీరో కార్తిక్ ఆర్యన్ తో కలిసి హారర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘భూల్ భులయ్యా 2’ సినిమా చేసింది. ఇందులో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్​, బ్యూటిఫుల్ హీరోయిన్​ కియరా అద్వానీ, టబు నటించారు. ప్రస్తుతం ఈ సినిమా హిట్ కావడంతో ఫుల్ జోష్​లో ఉంది కియరా. తాజాగా, ‘భూల్ భులయ్యా 2’ సక్సెస్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలిపింది. దెయ్యాలంటే భయమా అని అడిగిన ప్రశ్నకు.. ‘నాకు దెయ్యాలంటే భయం లేదు. కానీ దెయ్యం సినిమాలు చూడను. అని తెలిపింది కియరా. ఇదే ఇంటర్వ్యూలో తన గతంలో జరిగిన ఓ సంఘటన గురించి చావుని దగ్గరగా చూశాను అని షేర్ చేసుకుంది.

కియారా తనకి జరిగిన ఆ అనుభవం గురించి మాట్లాడుతూ.. ”కాలేజ్ డేస్​లో ఫ్రెండ్స్​తో కలిసి ధర్మశాల టూర్​ వెళ్లాను. మంచు ఎక్కువగా కురవడంతో నాలుగురోజులపాటు మేం హోటల్​ గదిలోనే ఉండాల్సి వచ్చింది. అప్పుడు కరెంట్ లేదు. తాగేందుకు మంచి నీళ్లు కూడా దొరకలేదు. వేడికోసం ఏర్పాటు చేసుకున్న మంట కూడా ఆరిపోతుందనుకున్నాం. నాలుగోరోజు రాత్రి గదిలో అందరం నిద్రపోతున్నప్పుడు మా పక్కనే ఉన్న కుర్చీకి అనుకోకుండా నిప్పు అంటుకుని మంటలు వ్యాపించాయి. అది చూసిన నా ఫ్రెండ్​ మా అందర్నీ నిద్రలేపింది. మేమంతా కేకలు వేయడంతో చుట్టుపక్కవాళ్లు వచ్చి తలుపులు పగలగొట్టారు. ఆరోజు చావుని దగ్గర నుంచి చూసినట్లనిపించింది. అదృష్టం కొద్దీ అక్కడి నుంచి బయటపడ్డాం.’ అని కియరా పేర్కొంది.

rashi khanna replaces keerthy suresh for sharwanand!

Akshara Gowda Stunning new Photoshoot Stills!