
రాకింగ్ స్టార్ యష్ KGF తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో టాక్సిక్పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకున్న తరుణంలో ఒక సెన్సేషనల్ న్యూస్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో హల్చల్ చేస్తోంది..
తాజా సమాచారం ప్రకారం..సినిమాలో తాను నటించిన కొన్ని బోల్డ్ , ఇంటిమేట్ సీన్లను తొలగించాలని లేదా ట్రిమ్ చేయాలని కియారా అద్వానీ దర్శకుడిని కోరినట్లు తెలుస్తోంది. హీరో యష్తో ఉన్న కొన్ని సన్నిహిత దృశ్యాలను స్క్రీన్ పైన చూసిన తర్వాత, ఆమె ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఆమె స్వయంగా దర్శకురాలు గీతూ మోహన్ దాస్తో పాటు హీరో యష్ను సైతం సంప్రదించి తన ఆందోళనను వ్యక్తం చేసినట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి..!!
