in

huge demand for chaithu’s love story!

ఫిదా తో అందర్నీ ఫిదా చేసిన శేఖర్ కమ్ముల..కాస్త గ్యాప్ తర్వాత నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా పెట్టి లవ్ స్టోరీ అనే ఓ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తున్నాడు. ఫిదా తర్వాత శేఖర్ ఈ సినిమా చేయడం..అందులోనూ సాయి పల్లవి , నాగ చైతన్య లు నటించడం తో ఈ మూవీ ఫై అందరిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కాగా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం షూటింగ్ లకు అనుమతి ఇవ్వడం తో రీసెంట్ గా షూటింగ్ మొదలుపెట్టారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఈ సినిమాలోని కీలక సన్నివేశాలు అన్నిటినీ షూట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను దక్కించుకునేందుకు ప్రముఖ ఓటిటి సంస్థలు అమెజాన్ , జీ 5 లు పోటీపడుతున్నాయట. భారీ ధర ఇస్తూ ముందుకు వస్తున్నాయట. కానీ నిర్మాతలు మాత్రం ఇంకా థియేటర్స్ లోనా..ఓటిటి లోనా అనేది డిసైడ్ చేసుకోలేకపోతున్నారట.

uppena beauty’s birthday gift!

vijay devarakonda as army officer?