in

‘gulabi’ fame maheshwari sensational comments on rgv!

గులాబీ సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది హీరోయిన్‌ మహేశ్వరి. ఆ తరువాత ఎక్కువ సినిమాల్లో నటించకపోయినా.. అందరి మనసులో ఆమె అపురూప సౌందర్యం, అభినయం ఇప్పటికీ అలాగే దాగి ఉంది. తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఈ భామ… టాలీవుడ్‌ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ పై సంచలన ఆరోపణలు చేసింది. రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడంటే వివాదాలతో ఫేమస్ అయ్యాడు కానీ..

అప్పట్లో వర్మ తీసిన సినిమాలు ఏ డైరెక్టర్ తీయలేదనే చెప్పాలి. హార్రర్ చిత్రాలు తీయడంలో వర్మ తరువాతే ఎవరైనా.. వర్మ తీసిన దెయ్యం సినిమా ఇప్పుడు 3డీలో హర్రర్ సినిమాలు చూస్తున్నవారికి చూపిస్తే జడుసుకోక మానరు. జెడి చక్రవర్తి, మహేశ్వరి, జయసుధ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ సినిమా ఆ రోజుల్లో భారీ విజయాన్ని అందుకొంది. అయితే ఆ సమయంలో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ని హీరోయిన్ మహేశ్వరీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

” దెయ్యం ” సినిమా షూటింగ్‌ మేడ్చల్‌ లోని వర్మ ఫామ్‌ హౌస్‌ లోజరిగిందని.. అక్కడి నుంచి మెయిన్‌ రోడ్డుకు 2 కిమీల దూరం ఉంటుందని నటి మహేశ్వరి చెప్పారు. అక్కడ శ్మశానం సెట్‌ చేశారని.. రాత్రి ఒంటి గంటకు ఎవరైనా మెయిన్‌ రోడ్డు వరకు ఒంటిరిగా వెళ్లొస్తారా అని అడిగారని.. వెళ్లి వస్తే.. రూ.50 వేలు ఇస్తానని రామ్‌ గోపాల్‌ వర్మ అన్నారని మహేశ్వరి చెప్పారు. దీంతో రామ్‌ గోపాల్‌ వర్మ చెప్పినట్లు వెల్లడించారు నటి మహేశ్వరి. అయితే.. ఒంటిరిగా వెళ్లి వచ్చినప్పటికీ.. రామ్‌ గోపాల్‌ వర్మ ఇంకా ఆ డబ్బులు ఇవ్వలేదని సంచలన ఆరోపణలు చేసింది.

PellisandaD girl Sree Leela signs her next with naveen polishetty!

bheemla nayak beauty Samyuktha Menon signs her second telugu film!