in

FIRST DUET OF SRIDEVI!

తిలోక సుందరి శ్రీ దేవి బాల నటిగా కెరీర్ ప్రారంభించి ఆ తరువాతి కాలం లో హీరోయిన్ గ ఎదిగి సుదీర్ఘమయిన నట ప్రస్థానం కలిగిన నటి. శ్రీ దేవి మొదట ఏ నటుడి సరసన జోడీగా నటించిందో తెలుసా? సిల్వర్ స్క్రీన్ మీద శ్రీ దేవి గారి మొదటి డ్యూయెట్ ఎవరితో కలసి నటించారో తెలుసా? నైంటీన్ సెవెంటీ ఫైవ్ లో కృష్ణ మంజుల జోడిగా నటించిన “దేవుడులాంటి మనిషి’ చిత్రంలో కమెడియన్ రాజబాబు కు జోడిగా శ్రీ దేవి నటించారు, ఈ సినిమా లో రాజబాబు, శ్రీ దేవి మధ్య “ద్రాక్ష పండు తీయన, నిమ్మ పండు పుల్లన” అని సాగె డ్యూయెట్ కూడా ఉంది, మరో విశేషం ఏమిటంటే శ్రీ దేవి కెరీర్ లో ఇదే మొట్ట మొదటి డ్యూయెట్.

ఆలా లెజెండరీ కమెడియన్ తో కలసి డ్యూయెట్ చేసే అదృష్టం శ్రీదేవి కి దక్కితే, ఫ్యూచర్ హీరోయిన్ తో కలసి చిందులు వేసే అదృష్టం రాజబాబు కు దక్కింది. ఆ తరువాత హీరోయిన్ గ ఎస్టాబ్లిష్ అయినా శ్రీ దేవి జాతీయ స్థాయి లో గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ హీరోలకు సైతం డేట్స్ ఇవ్వలేని స్థాయికి ఎదిగిన శ్రీదేవి, తాను నటించాలంటే కండిషన్స్ పెట్టె స్థాయి కి ఎదిగారు. ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన స్టార్ కమెడియన్ రాజబాబు, తన అందచందాలతో, నటనతో ప్రేక్షకులను మైమరపించిన శ్రీదేవి ఇద్దరు ఈ లోకంలో లేకపోవటం బాధాకరం..

Kajal Aggarwal recreates Baahubali scene with her son!

Macherla Niyojakavargam!