in

Disturbed charmee announces break to social media!

టాలీవుడ్‌లో న‌టిగా, నిర్మాత‌గా త‌న కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది ఛార్మీ కౌర్. కాగా.. న‌ట‌న‌కు దూర‌మైన ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం నిర్మాణ ప‌నుల్లోనే బిజీగా ఉంది. ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ నిర్మించే చిత్రాల బాధ్య‌త‌ల‌ను చూస్తోంది ఛార్మీ. ఇదిలా ఉంటే.. ఛార్మీ తాజాగా ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సోషల్‌ మీడియాకు తాత్కాలికంగా గుడ్‌బై చెబుతున్న‌ట్లు తెలిపింది. ఈ విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

దీనిలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ‌ను చూడ‌లేక‌పోతున్నాన‌నంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ప్రస్తుత పరిస్థితి మరింత భయంకరంగా మారేట్టు కనిపిస్తోంది. దురదృష్టవశాత్తు వీటన్నంటిని చూసి తట్టుకునేంత శక్తి నాకు లేదు.. అందుకే కొన్ని రోజులు సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నాను. అందరూ ఇంట్లోనే ఉండండి.. మీరు ప్రేమించే వారిని జాగ్రత్తగా చూసుకోండి ఆపోస్టులో ఛార్మీ తెలిపింది.

27 YEARS FOR HELLO BROTHER!

krack jayamma to play crucial role in balayya’s next!