in

director midha kopamtho shooting aapesina akkineni nageswara rao!

దాగుడుముతల దాంపత్యం సినిమా షూటింగ్ లో డైరెక్టర్ రేలంగి నరసింహ రావు మీద కోపం వచ్చిన అక్కినేని గారు షూటింగ్ ఆపించేసారు, ఎందుకు ఆపించారు ఏమిటి ? జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఒక ఇంట్లో షూటింగ్ జరుగుతుంది, అక్కినేని గారు, శారద గారు, రమ్య కృష్ణ గారు కాంబినేషన్ లో సీన్లు షూట్ చేస్తున్నారు, ఒక లాంగ్ షాట్ సెట్ చేయమని చెప్పిన రేలంగి గారు, ఆ గ్యాప్ లో టెర్రస్ మీదకు వెళ్లిపోయారు ఒక్కరే. స్పాట్ లో రేలంగి గారు కనపడకపోయే సరికి అక్కినేని గారు ఎక్కడయ్య మీ డైరెక్టర్ అని అడిగారట, అదేమిటి మేము అందరం ఇక్కడ ఉంటె అయన ఒక్కడే ఆలా వెళ్లిపోయాడేందుకు అని ఆరా తీశారు అక్కినేని గారు.

నిర్మాత విషయం చెప్పిన వెంటనే టెర్రస్ మీదకు వెళ్లిన అక్కినేని గారు రేలంగి గారి భుజం మీద చేయి వేసి, ఏమయ్యా ఇంత జరిగితే నువ్వు వెళ్లకుండా ఇక్కడ ఉండటం ఏమిటి అని అడిగేసరికి, రేలంగి గారి కళ్ళలో నీళ్లు తిరిగాయి, విషయం ఏమిటంటే ఆ ముందు రోజు బెంగుళూరు లో ఉన్న రేలంగి బావ మరిది చనిపోయారట, అయన తన ఫ్యామిలీని అక్కడకు పంపించి, తాను ఉండిపోయారు, ఇంతమంది ఆర్టిస్టుల కాంబినేషన్ షాట్స్ పెండింగ్ వేయటం ఇష్టం లేక. ఆయనను ఓదార్చిన నాగేశ్వర రావు గారు షూటింగ్ ఆపివేయించి, ఫ్లైట్ టికెట్ తెప్పించి రేలంగి గారిని బెంగుళూరు పంపించారట. . అవసరం అయితే మేమందరం మళ్ళీ కాల్ షీట్స్ ఇస్తాము అందరితో నేను మాట్లాడతాను నువ్వు టెన్షన్ పడకు అని ధైర్యం చెప్పారట.

kajal agarwal signs another web series!

Uppena Movie Breaks 14 Years Old Record!