త్వరలోనే దిల్ రాజు నిర్మాణంలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న చిత్రం తమ్ముడు నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి ఆదరణ సొంతం చేసుకుంటూ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగానే ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ ఎన్నో ఆశక్తికరమైన విషయాలను బయటపెట్టారు.
ఇక దిల్ రాజు మాట్లాడుతూ తాను తమ్ముడు సినిమా నుంచి తన టీం అందరికీ ఒక విషయాన్ని కచ్చితంగా చెప్పానని తెలిపారు. ఎవరూ కూడా యూట్యూబ్లో విడుదల చేసే ట్రైలర్ వ్యూస్ కొనుగోలు చేయకూడదని వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపారు. ఒక సినిమా ట్రైలర్ లేదా టీజర్ ఒక పాట విడుదల అయితే ఆ పాటకు యూట్యూబ్ నుంచి ఎన్ని వ్యూస్ వస్తాయో ఆ వ్యూస్ మాత్రమే పెట్టాలని డబ్బులు ఇచ్చి వ్యూస్ కొనుగోలు చేయకూడదని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఇలా డబ్బులు పెట్టి మిలియన్స్ వ్యూస్ వచ్చాయని చెప్పుకోవడం వల్ల పెద్దగా వరిగేది లేదని తెలిపారు..!!